News

శ్రీనగర్‌ చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌షా

763views

జమ్మూకశ్మీర్‌: జమ్మూకశ్మీర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శనివారం శ్రీనగర్‌ చేరుకున్నారు. 370 ఆర్టికల్‌ రద్దు తర్వాత హోంమంత్రి మొదటి సారిగా అక్కడ ప్రర్యటిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌కు కల్పిస్తున్న ప్రత్యేక హోదాను 2019 ఆగస్టు 5న రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం లడఖ్‌, జమ్ము అండ్‌ కశ్మీర్‌లను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది.

శ్రీనగర్‌ నుంచి షార్జాకు తొలి అంతర్జాతీయ విమాన సేవలు ప్రారంభం అవుతున్న వేళ షా కశ్మీర్‌ లోయలో పర్యటిస్తున్నారు. అమిత్‌షా భద్రత, శ్రీనగర్‌ అభివృద్ధిపై సమీక్షంచనున్నారు. అనంతరం పార్టీ ర్యాలీలో పాల్గొనున్నారు. 26 మంది ఖైదీలను జమ్మూకాశ్మీర్‌ జైలు నుంచి ఆగ్ర సెంట్రల్‌ జైలుకు తరలించారు. హోం మంత్రి పర్యటనకు ముందు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మధ్య కాలంలో జమ్ములో ఇతర ప్రాంతాల వారిని ఉగ్రవాదులు హత్య చేస్తున్నారు. అమాయక పౌరులను టార్గెట్‌ చేస్తున్న ముష్కరులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలో అమిత్‌ షా అక్కడ పర్యటనకు వెళ్లడంతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి