కశ్మీర్ లో ఉపాధ్యాయుల హత్యపై ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు… ఉగ్రవాద సానుభూతి పరులైన 40 మంది టీచర్లకు సమన్లు… 400 మంది అరెస్ట్..

471views
జమ్ముకశ్మీర్లో మైనారిటీలపై దాడులు, హత్యల వ్యవహారానికి సంబంధించిన కేసులో 40 మంది టీచర్లకు ఎన్ఐఏ సమన్లు పంపింది. శ్రీనగర్లోని ఈద్గఢ్ ప్రాంతంలో పాఠశాల ఆవరణంలో ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురైన ప్రిన్సిపాల్ సుపీందర్ కౌర్, ఉపాధ్యాయుడు దీపక్ చంద్ ల హత్యలపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది.
అమిత్ షా ఆదేశాలతో ఉగ్రవాద నిరోధక విభాగం అధిపతి తపన్ దేకా నాయకత్వంలో ఐబీ ఉన్నతాధికారులు శ్రీనగర్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఈ హత్యలతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న జమాత్-ఎ-ఇస్లామి, తెహ్రీక్-ఎ-హురియత్ సహా పలు ఉగ్రసంస్థలకు చెందిన వ్యక్తులతో సంబంధాలున్న 400 మందిని NIA అధికారులు అరెస్టు చేశారు.





