News

‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అని వినిపించాలట..!

721views

బలూచిస్తాన్‌: పాకిస్తాన్‌ నుండి విముక్తి పొందాలని బలూచిస్తాన్‌ ప్రజలు ఎప్పటి నుండో కోరుకుంటూ ఉన్నారు. అయితే, అక్కడి ప్రజల వాయిస్‌ను పాకిస్తాన్‌ తొక్కేస్తూ ఉంది. తాజాగా బలూచిస్తాన్‌ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రభుత్వం సీనియర్‌ అధికారులు, వివిధ విభాగాల అధిపతులు తమ మొబైల్‌ ఫోన్‌ రింగ్‌బ్యాక్‌ టోన్‌ను ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’గా సెట్‌ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అనే కాలర్‌ ట్యూన్‌ను అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీలు, అదనపు సెక్రటరీలు ఇతర సభ్యులు పెట్టుకోవాల్సిందేనని చీఫ్‌ సెక్రటరీ అధ్యక్షతన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నెట్‌లో ఆర్డర్‌ కాపీ అందుబాటులో ఉంది. రింగ్‌బ్యాక్‌ టోన్‌ లేదా కాలర్‌ ట్యూన్‌ అన్నది కాల్‌ చేసే వారు రింగ్‌ బ్యాక్‌ చేస్తున్నప్పుడు వినిపించే వాయిస్‌. రింగింగ్‌ సౌండ్‌ బదులుగా ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’ అని వినిపించాలట..! అయితే టెలికాం ఆపరేటర్లు కస్టమర్‌లకు డిఫాల్ట్‌ టోన్‌ స్థానంలో కస్టమ్‌ టోన్‌లను సెట్‌ చేయడానికి అనుమతిస్తారు.

ఉత్తర్వులో పేర్కొన్న సంబంధిత అధికారులందరూ వీటిని పాటించాలని కోరారు. ఎస్‌ అండ్‌ జిఎడి అదనపు కార్యదర్శులు తమ మొబైల్‌ ఫోన్‌ నంబర్‌లకు ఇదే రింగ్‌బ్యాక్‌ టోన్‌లను వర్తింపజేసేలా చూసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. సీనియర్‌ అధికారుల రింగ్‌బ్యాక్‌ టోన్‌ల విషయంలో బలూచిస్తాన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎంతో మంది ట్విట్టర్‌లో పోస్టులను పెట్టారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి