
లాహోర్: ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్థాన్లో నిరుద్యోగం అక్కడి యువతను కాటేస్తోంది. పాకిస్తాన్లో నిరుద్యోగం గరిష్ఠ స్థాయికి చేరుకుంది. కరోనా వ్యాప్తి సమయంలో దాదాపు రెండో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. ముందే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం, నిరుద్యోగం పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇక్కడ నిరుద్యోగిత రేటు 16 శాతం దాటిందని పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్(పీఐడీఈ) కొత్త గణాంకాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం చదువుకున్న యువతలో 24 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు.
ఇటీవల పాకిస్తాన్ కోర్టులో ఒక్క ప్యూన్ పోస్ట్ కోసం దరఖాస్తులు కోరగా.. 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంఫిల్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారని పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం దేశంలో 40 శాతం గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్లు నిరుద్యోగులుగా ఉన్నారు. ఎంఫిల్లో చదివిన వారు కూడా చాలా మంది ఉన్నారు.
Source: Nijamtoday





