
569views
ఐక్యరాజ్యసమితి: ప్రపంచదేశాలకు కొవిడ్ వ్యాక్సిన్ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించిన భారత్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో 40 శాతం మందికి టీకా అందించాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈ అంశం దోహదపడుతుందని తెలిపింది. ఈ మేరకు భారత వైద్య, ఆరోగ్య మంత్రి మాన్సుఖ్ మాండవియాకు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయెసస్ కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.





