
భోపాల్: హిందూ ధర్మంలో గొప్ప గ్రంథమైన రామ్ చరిత్ మానస్ను విద్యార్థులకు పాఠ్యంశంగా బోధించనున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఇక నుంచి శ్రీరాముడి గురించి బోధించాలని అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. ఫిలాసఫీలో బోధించడానికి ఉన్నత విద్యా విభాగం రామ్చరిత్మానస్ ప్రాక్టికల్ దర్శన్ణ అనే సిలబస్ను సిద్ధం చేసింది. ఇందులో 100 మార్కుల పరీక్ష ఉంటుంది.
అయితే ఇది కంపల్సరీ కాదు.. ఎవరికీ ఇష్టమైతే వారు ఈ పాఠ్యాంశాన్ని ఎంచుకొనే వీలుకల్పించింది. దీనిని హిందీ లేదా ఫిలాసఫీ ప్రొఫెసర్లు బోధిస్తారు. ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యార్థులకు బోధించడానికి సర్వం సిద్ధం చేసింది అక్కడి ప్రభుత్వం.
ఆ రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ మంత్రి మోహన్ యాదవ్ ఈ విషయంపై స్పందిస్తూ.. నిజ జీవితంలో విలువలున్న వారి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడం వంటి అనేక అంశాలను విద్యార్థులకు బోధించడానికి వీటిని పాఠ్యంశాలుగా చేర్చబడ్డాయని చెప్పారు. రామ్చరితమానస్లో సైన్స్, సంస్కృతి, సాహిత్యం కలిగి ఉందన్నారు. ఇది ఏ మతానికి చెందింది కాదని.. ఉర్దూ గజల్ని కూడా ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టామని చెప్పారు.
Source: Tv9





