
న్యూఢిల్లీ: చైనాలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. దక్షిణ చైనా.. ఫుజియాన్ రాష్ట్రంలోని పుతియాన్ నగరంలో కరోనా వైరస్ కలకలం రేగింది. 24గంటల్లో అక్కడ కొత్తగా 190 కరోనా కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకటించింది. దీంతో వ్యాప్తిని అడ్డుకోవడానికి అధికారులు కఠిన చర్యలను చేపట్టారు. ఈ క్రమంలో పుతియాన్లో వైరస్ వ్యాప్తిని పర్యవేక్షించేందుకు నిపుణులను పంపినట్టు చైనా ఎన్హెచ్సీ తెలిపింది.
నగరంలోని ప్రజలు .. నగరం దాటి వెళ్లవద్దంటూ ఆంక్షలు పెట్టారు. అంతేకాదు పుతియాన్ లోని బస్సు, రైలు సేవలను నిలిపివేశారు. అయితే, అత్యవసరంగా నగరం దాటి వెళ్లేవారు.. తప్పనిసరిగా 48 గంటల ముందు కొవిడ్ నెగెటివ్గా సర్టిఫికెట్ చూపించాలని అధికారులు స్పష్టం చేశారు. అంతేకాదు నగరంలోని సినిమా హాళ్లు, పేకాట స్థలాలు, జిమ్లు, పర్యటక ప్రదేశాలతో పాటు జనం ఎక్కువగా ఉండే అన్ని రకాల ప్రదేశాలను అధికారులు క్లోజ్ చేశారు.
రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లకు మినహాయింపు ఇచ్చారు. కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక మరోవైపు ఫుజియాన్ తో పాటు క్వాన్జోవులో కూడా మళ్ళీ కరోనా కేసులు నమోదవుతున్నాయి.





