
551views
-
నిఘా వర్గాల హెచ్చరిక
-
సానుభూతిపరుల్లో కేరళీయులు
న్యూఢిల్లీ: అఫ్గాన్ నుంచి 25 మంది ఐసిస్ సానుభూతిపరులు భారత్లోకి చొరబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తాలిబన్లు జైళ్లలో ఉన్న ఖైదీలను విడుదల చేసిన తర్వాత వీరికి మళ్లీ స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నాయి. వీరంతా కేరళకు చెందిన భారతీయులేనని, భారత్కు అతిపెద్ద ముప్పుగా పరిణమించిన ఐసిస్ పట్ల ఆకర్షితులై 2016-18 మధ్య దేశాన్ని వీడినట్టు చెప్పాయి.





