
టోక్యో పారాలింపిక్స్ లో పాల్గొన్న భారత అథ్లెట్లకు దిల్లీ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. పతకాలు సాధించిన నలుగురు క్రీడాకారులను చూసేందుకు ఎయిర్పోర్ట్ వద్దకు పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు. ముఖ్యంగా జావెలిన్ త్రోలో స్వర్ణ పతకం సాధించిన సుమిత్ అంటిల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. దిల్లీ చేరుకున్న వారిలో సుమిత్తో పాటు రజత పతక విజేతలు దేవేంద్ర ఝజారియా, యోగేశ్ కథునియా(డిస్కస్ త్రో).. కాంస్య పతక విజేత శరద్ కుమార్(హైజంప్) ఉన్నారు.
భారత్లో క్రికెట్ బ్యాట్కు పోటీగా జావెలిన్ త్రో ఈటెకు పాపులారిటీ పెరుగుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. పారాలింపిక్స్లో పతకాలు సాధించి.. స్వదేశానికి చేరుకున్న అథ్లెట్లతో శుక్రవారం ఆయన మాట్లాడారు. అనంతరం గోల్డ్ మెడలిస్ట్ సుమిత్తో పాటు రజత పతక విజేతలు దేవేంద్ర ఝజారియా(జావెలిన్ త్రో), యోగేశ్ కథునియా కాంస్య పతక విజేత శరద్ కుమార్ లను అనురాగ్ సత్కరించారు.





