
తాలిబాన్లు పాకిస్తాన్ ను తమ ‘రెండో ఇల్లు’ గా అభివర్ణించిన తరువాత, ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం తాలిబానీ నాయకుల సంరక్షణ బాధ్యత స్వీకరించిందని పాకిస్థాన్ మంత్రి షేక్ రషీద్ ఇప్పుడు ఒక టీవీ కార్యక్రమంలో ఒప్పుకున్నారు.
“మేము తాలిబాన్ నాయకుల సంరక్షకులం. మేము వారిని చాలాకాలం చూసుకున్నాము. వారు పాకిస్తాన్లో ఆశ్రయం, విద్య మరియు ఇల్లు పొందారు. మేము వారి కోసం ప్రతిదీ చేశాము, ”హషింగ్ న్యూస్ ప్రోగ్రామ్‘ బ్రేకింగ్ పాయింట్ విత్ మాలిక్ ’లో మాట్లాడుతూ రషీద్ బహిరంగంగా ఈ విషయాలన్నీ వెల్లడించాడు.
తాలిబాన్లను ప్రస్తుతిస్తూ, యుఎస్ ను దుమ్మెత్తిపోస్తూ, రషీద్ గత వారం జరిగిన మరొక ఇంటర్వ్యూలో పాకిస్తాన్ చాలాకాలం యుఎస్ దళానికి ఆశ్రయం ఇవ్వడానికి ఇష్టపడలేదని వెల్లడించాడు. “వారు దేశంలో ఉండడం పరిమిత కాలం మాత్రమే” అని మంత్రి వ్యాఖ్యానించారు.
భారతదేశంలో హిందువులను మాత్రమే చంపి, ముస్లింలను ఆదుకునే ‘స్మార్ట్ బాంబులు’ అభివృద్ధి చేసే సాంకేతికత పాకిస్తాన్ వద్ద ఉందని ఒకప్పుడు రషీద్ వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి జిహాదీ సంస్థలతో ఎలాంటి సంబంధాలూ లేవన్న భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయి. వాస్తవానికి, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంతో, పాకిస్తాన్ తాలిబన్ల సాయంతో కశ్మీర్ ను జయించాలని పాక్ నాయకులు కలలు కంటున్నారు.
ఇమ్రాన్ ఖాన్ కు చెందిన తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ నాయకుడు నీలం ఇర్షాద్ షేక్ ఓ పాకిస్తాన్ న్యూస్ ఛానెల్లో మాట్లాడుతూ ‘తాలిబాన్లు మాతో ఉన్నారు’ కాశ్మీర్ని గెలవడంలో వారు మాకు సహాయపడతారు” అని చెప్పారు.
ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్లకు మద్దతుగా ఇస్లామాబాద్ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి నొక్కిచెప్పిన కొద్దిసేపటికే పాకిస్థాన్ మంత్రి ఈ వ్యాఖ్యలు చెయ్యడం విశేషం.
పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాలిబాన్లను ‘సాధారణ పౌరులు’ అని పిలిచారు. తాలిబాన్ అధికారంలోకి రావడంతో ఆఫ్ఘన్ జనాభా ‘బానిస సంకెళ్ళను’ తెంచుకున్నదని పేర్కొంటూ తాలిబన్ల జిహాదీ చర్యలను కూడా ఇమ్రాన్ సమర్థించాడు.
“పాకిస్తాన్తో సంబంధాలను మరింతగా దృఢతరం చేసుకోవడానికి మేము ఎదురుచూస్తున్నాము” అని తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో పాకిస్తాన్తో తమాకున్న ప్రేమ మరియు సంబంధాన్ని వ్యక్తం చేశారు.
“ఆఫ్ఘనిస్తాన్ తన సరిహద్దులను పాకిస్థాన్తో పంచుకుంటుంది. మతం విషయానికి వస్తే మేము సాంప్రదాయకంగా సమన్వయంతో ఉన్నాము, రెండు దేశాల ప్రజలు ఒకరితో ఒకరు కలిసిపోతారు. కాబట్టి మేము పాకిస్తాన్తో సంబంధాలను మరింత గాఢపరచడం కోసం ఎదురు చూస్తున్నాము, ”అని ముజాహిద్ అన్నారు, భారతదేశంతో కూడా మంచి సంబంధాలు ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాము.
దీనికి ముందు, ఆఫ్ఘనిస్తాన్లో గందరగోళం సృష్టించడానికి తాలిబాన్లకు పేలుడు పదార్థాలను అందించే ఉగ్రవాద కర్మాగారాలు మరియు శిబిరాలను పాకిస్తాన్ ఏర్పాటు చేసినట్లు ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక అధ్యక్షుడు సలేహ్ ఆరోపించాడు.
Source : OPINDIA





