News

శ్రీలంక మీదుగా కేరళలోకి ప్రవేశించిన12 మంది ఉగ్రవాదులు – కేరళ మరియు కర్ణాటకలలో హై అలర్ట్

1.3kviews

రెండు పడవల్లో ప్రయాణిస్తూ శ్రీలంక నుండి 12 మంది ఉగ్రవాదులు అలప్పుజ జిల్లాలోకి ప్రవేశించనున్నారని కేరళ ప్రభుత్వాన్ని కర్ణాటక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెచ్చరించింది. ఈ పరిణామం తరువాత కేరళ మరియు కర్ణాటక తీరప్రాంతాల్లో హై అలర్ట్‌లు జారీ చేయబడ్డాయి. ఈ ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వస్తున్నారని నిఘా వర్గాలు సూచిస్తున్నాయి.

కేరళ, కర్ణాటకలకు చెందిన మత్స్యకారులు అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కూడా పోలీసులు కోరారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు మన దేశంలో అలజడులు సృష్టించటానికి పాకిస్తాన్ ప్రయత్నించింది. ఆ దిశగా ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చినట్లుగానూ, వారిని ప్రేరేపించినట్లుగానూ ఇంతకముందు వార్తలు వచ్చాయి. జమ్ము ప్రాంతంలో డ్రోన్‌లను కూడా అదే ప్రయోజనం కోసం ఉపయోగించారు. కానీ భద్రతా దళాలు ఈ ప్రయత్నాలన్నింటినీ విఫలం చేశాయి. ఇప్పుడు, ఈ తీవ్రవాదులు దక్షిణ భారతదేశంలో దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.