News

పంజ్‌షీర్ లోయ : నార్తర్న్ అలయెన్స్ ఫైటర్‌ల చేతిలో 41 మంది తాలిబాన్ తీవ్రవాదులు హతం

410views

నార్తర్న్ అలయెన్స్ ఫైటర్లకు, తాలిబాన్లకు జరిగిన పోరులో, 41 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. నార్తర్న్ అలయెన్స్ ఫైటర్లు పంజ్ ‌షీర్ లోయలో 20 మంది తాలిబన్లను ఖైదీలుగా పట్టుకున్నారు. ఖవాక్ పాస్ సమీపంలో ఈ దాడి జరిగింది. తాలిబన్ల దాడిని NRF విజయవంతంగా ఎదుర్కొంది. 41 మంది తాలిబాన్ ఉగ్రవాదులను చంపింది. ఇతరులను ఖైదీలుగా బంధించింది.

అండరాబ్ ‌లోని పొల్సర్ ‌లోని గాజా సెక్షన్‌లో జరిగిన మరో గెరిల్లా దాడికి, 34 మంది తాలిబాన్ ఉగ్రవాదులు హతమయ్యారు. దీనితో, గత 24 గంటల్లో అండరాబ్ జిల్లాలలో తాలిబాన్లు భారీ ప్రాణనష్టానికి గురయ్యారు. అందిన సమాచారం మేరకు, నార్తర్న్ అలయన్స్ కమాండర్ హసీబ్, “మేము మిమ్మల్ని లోయలోకి రానిస్తాము గానీ బయటకు మాత్రం వెళ్ళనివ్వము” అని చెప్పాడు.

పంజ్ ‌షీర్‌పై దాడికి తాలిబన్ లు చేసిన ప్రయత్నానికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అహ్మద్ మసూద్ నేతృత్వంలోని బలగాలు కనీసం 9-10 మంది ఉగ్రవాదులను చంపాయి. నార్తర్న్ అలయెన్స్ ఫైటర్లకు చెందిన ఇద్దరు సభ్యులు కూడా గాయపడ్డారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.