ఆఫ్ఘనిస్టాన్ ను స్వాధీనం చేసుకున్నందుకు తాలిబాన్ ను ప్రశంసించిన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB)

ఆఫ్ఘనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్నందుకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (AIMPLB) తాలిబాన్ ను ప్రశంసించింది. ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్థాన్ లోని ప్రజలందరికీ క్షమాభిక్షను ప్రసాదించటాన్ని కూడా ప్రశంసించిందని ‘టైమ్స్ నౌ’ వెల్లడించింది.
AIMPLB సభ్యుడైన సజ్జాద్ నోమాని తాలిబాన్లను బహిరంగంగా అభినందించారు. ఒకవైపు అతను ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన హింసను ఖండించాడు. తాలిబన్, ప్రజలకు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని కూడా అభినందించాడు.
నోమాని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వర్కింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు. అల్-ఫుర్కాన్ మ్యాగజైన్ ఎడిటర్. రహమాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్.
ఇది ‘అమెరికా అణచివేతకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ విజయం’ – సమాజ్ వాదీ పార్టీ నాయకుడు మొహద్ రెహాన్ ఖాన్
ఆఫ్ఘన్ పౌరుల మానవ హక్కుల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యకతమవుతున్న వేళ ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబాన్ ఆక్రమించడంపై సమాజ్ వాదీ పార్టీ ఎంపీ షఫీఖర్ రహమాన్ బార్క్ హర్షం వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన ఉత్తర ప్రదేశ్ సంబల్ నుండి దిగ్భ్రాంతికరమైన ప్రకటన ఇచ్చారు. రష్యా, అమెరికా వంటి బలమైన దేశాలను కూడా తమ దేశంలో స్థిరపడనివ్వని శక్తి తాలిబాన్ దని ఎస్పి ఎంపి వ్యాఖ్యానించారు.
షఫీఖుర్ రహమాన్ బార్క్ చాలా తరచుగా ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేస్తూ ఉంటారు. తాలిబాన్ ను ప్రశంసిస్తూ, ఇప్పుడు తాలిబాన్లు తమ దేశాన్ని తామే నడపాలని కోరుకుంటున్నారని, అది ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత విషయమని బార్క్ అన్నారు.
మరో ప్రముఖ సమాజ్వాదీ పార్టీ (ఎస్పి) నాయకుడు మొహమ్మద్ రెహాన్ ఖాన్, ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబాన్ స్వాధీనం చేసుకోవడం అమెరికా అణచివేత విధానాలకు వ్యతిరేకంగా సాధించిన గొప్ప విజయమని ప్రశంసించారు. మరో ఎస్పి నాయకుడు మరియు యుపి మాజీ మంత్రి ఒకరు మాట్లాడుతూ, దేశంలో శాంతిని నెలకొలిపే ప్రయత్నం చేస్తున్న తాలిబాన్ను నమ్మకుండా ఉండటానికి ఎటువంటి కారణం లేదని అన్నారు.
Source : Organiser





