
దేశాధ్యక్షుడు పోస్ట్ చేసిన ట్వీట్ను తొలగించడంతో పాటు ఆ ఖాతాను 12 గంటల పాటు సస్పెండ్ చేయడంతో ఆ దేశంలో ట్విట్టర్ బ్యాన్కు గురైయ్యింది. దేశంలో ట్విట్టర్ కార్యకలాపాలను నిరవధికంగా నిలుపుదల చేస్తూ ఆఫ్రికా దేశమైన నైజీరియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు నైజీరియా సమాచార, సాంస్కృతిక మంత్రి అల్హాజి లాయ్ మొహ్మద్ శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. దేశంలో కార్పొరేట్ ఉనికిని అణచివేసే కార్యకలాపాల కోసం ట్విట్టర్ను వినియోగిస్తున్నందున ఫెడరల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అయితే ట్విట్టర్ను బ్యాన్ చేస్తూ నైజీరియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఇతర కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారి రెండ్రోజుల క్రితం చేసిన ఓ పోస్ట్ను అభ్యంతరకరమైన పోస్ట్గా పరిగణిస్తూ దాన్ని ట్విట్టర్ డిలీట్ చేసింది. దీంతో పాటు ఆయన ట్విట్టర్ ఖాతాను 12 గంటల పాటు సస్పెండ్ చేసింది. దీనికి ప్రతీకారంగానే దేశంలో ట్విట్టర్ కార్యకలాపాలను నిలుపుదల చేస్తూ నైజీరియా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.





