News

నేపాల్‌ ఆర్మీకి భారత టీకాలు

304views

కోవిడ్ మహమ్మారిపై పోరులో భాగంగా అనేక దేశాలకు ‘వ్యాక్సిన్‌’ సహకారం అందించిన భారత్‌.. పొరుగు దేశం నేపాల్‌ సైన్యానికి టీకాలను అందించింది. ఇరు దేశాల నడుమ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా నేపాల్‌ ఆర్మీకి.. భారత్‌ సైన్యం లక్ష డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్లను బహుమతిగా ఇచ్చింది.

త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారత ఆర్మీ అధికారులు వీటిని నేపాల్ సైనికాధికారులకు అందజేసినట్లు భారత ఎంబసీ సోమవారం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. అంతకుముందు నేపాల్‌ ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కోసం భారత ప్రభుత్వం ఆ దేశానికి పది లక్షల స్వదేశీ వ్యాక్సిన్లను పంపించిన విషయం తెలిసిందే. నేపాల్‌లో ఇప్పటివరకు 2.7లక్షల మందికి కరోనా వైరస్‌ సోకగా.. 3,027 మంది మహమ్మారికి బలయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.