News

మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది అల్-బదర్ చీఫ్ ఘని ఖ్వాజాని కాల్చి చంపిన భారత్ ఆర్మీ

1kviews

మ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట  కొనసాగుతోంది.  అదే క్రమంలో, మంగళవారం జమ్మూ కాశ్మీర్ పోలీసులు సోపోర్‌లోని అల్-బదర్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ఘని ఖ్వాజాను కాల్చి చంపాయి.  అధికారుల సమాచారం ప్రకారం, సోపోర్‌లోని తుజ్జార్ షరీఫ్ ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు మంగళవారం సాయంత్రం పక్కా సమాచారం అందింది. ఆలస్యం చేయకుండా ఆ ప్రాంతాన్ని ముట్టడించిన పోలీసు బృందం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.  ఈ సమయంలో భద్రతా దళాలపై ఓ ఉగ్రవాది కాల్పులు జరిపాడు. ప్రతిగా భద్రతా దళాలు కూడా కాల్పులు జరిపాయి. ఈ కాల్పులలో ఉగ్రవాది మృతి చెందాడు.

ఎన్‌కౌంటర్ స్థలంలో ఉగ్రవాది లొంగిపోవడానికి కూడా భద్రతా దళాలు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. అయితే ఉగ్రవాది లొంగిరాలేదు.  భద్రతా దళాలు కాల్చి చంపిన ఉగ్రవాది నుంచి ఆయుధాలతో సహా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌ను ధృవీకరిస్తూ చని పోయిన ఉగ్రవాదిని అల్ బదర్ చీఫ్ ఘని ఖ్వాజాగా గుర్తించినట్లు కాశ్మీర్ డివిజన్‌కు చెందిన ఐజిపి విజయ్ కుమార్ తెలిపారు.  భద్రతా దళాలకు ఇది గొప్ప విజయమని ఆయన అన్నారు.

Source : Samardha News

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.