News

బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ ఉగ్రవాద సంస్థల నుండి కాశ్మీర్ ఉగ్రవాద సంస్థలకు క్రిప్టోకరెన్సీ 

637views

కాశ్మీర్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలకు, క్రిప్టోకరెన్సీ రూపంలో నిధులు అందినట్లు సమాచారం. బంగ్లాదేశ్‌లోని నిషేధిత ఉగ్రవాద సంస్థ అన్సార్ అల్ ఇస్లాం సంస్థ ఉగ్రవాదులకు భారీగా నిధులు సమకూర్చినట్లు ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రకటించారు.

స్పెషల్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం చేత అరెస్టు చేయబడిన ఇద్దరు ఉగ్రవాదుల విచారణలో ఈ రహస్యాలు వెల్లడయ్యాయి.  2019 లో తమకు అలాంటి నిధులు వచ్చాయని వెల్లడించారు. అన్సార్ అల్ ఇస్లాం ఉగ్రవాదులు అవాల్ నవాజ్, ఫాజిల్ రబీ చౌదరి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. 2014 నుండి కాశ్మీర్‌లోని ఉగ్రవాద సంస్థలు బిట్‌కాయిన్ రూపంలో విదేశాల నుంచి డబ్బు వసూల చేస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో పాటు, పాకిస్తాన్ మరియు గల్ఫ్ దేశాల నుండి క్రిప్టోకరెన్సీల రూపంలో ఈ డబ్బు వచ్చినట్లు తెలుస్తుంది.  పట్టుబడిన  ఉగ్రవాదులే ఇతర ఉగ్రవాద సంస్థలకు ఆ డబ్బుని అప్పగించినట్లు విచారణలో తేలింది

దేశంలో వర్చువల్ కరెన్సీని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది.  బిట్‌కాయిన్‌ల రూపంలో అక్రమ లావాదేవీలను గుర్తించడం కష్టంగా ఉన్నందున దీనిని ఉగ్రవాద సంస్థలు విస్తృతంగా ఉపయోగిస్తున్నాయని ఉగ్రవాదులు తెలిపారు.  ఈ ఉగ్రవాద సంస్థలకు చాలా వరకు విదేశీ సంస్థల ద్వారానే నిధులు సమకురుతున్నాయి.

Source : Samardha News

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.