435
అయోధ్యలో నిర్మితమవుతున్న రామ మందిరానికి కర్ణాటకకు చెందిన ఓ కళాకారుడు వినూత్నంగా మద్దతు తెలిపాడు. రఘుయా బడే అనే కళాకారుడు రూపాయి, ఐదు రూపాయల నాణేలతో అయోధ్య రామమందిరం నమూనాను కళాత్మకంగా రూపొందించారు. బెంగళూరులో ఏర్పాటుచేసిన ఈ నాణేల రాముడు విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఈ రామమందిర నమూనాను రూపొందించేందుకు రూ.2 లక్షల విలువైన 60 వేల నాణేలను వినియోగించినట్లు బడే పేర్కొన్నారు.