
భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణేకు నేపాలీ ఆర్మీ గౌరవ జనరల్ హోదా ల్యాబ్ హించింది. ఈ హోదాను నేపాల్ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి ఖాట్మండులో ప్రదానం చేశారు. ఖాట్మండులోని రాష్ట్రపతి అధికారిక నివాసం ‘షిటల్ నివాస్’ లో నిన్న జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనను సత్కరించారు. ఫంక్షన్ సందర్భంగా అతనికి కత్తి మరియు స్క్రోల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నేపాల్ ప్రధాని కె.పి. శర్మ ఒలి, భారత రాయబారి వినయ్ ఎం. క్వాత్రా మరియు ఇరు దేశాల ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
వేడుక తరువాత, జనరల్ నరవణే నేపాల్ అధ్యక్షుడిని కలిశారు. ఆయనతో పాటు రాయబారి వినయ్ ఎం. క్వాత్రా ఉన్నారు. సమావేశంలో, జనరల్ నరవణే తనకు ఇచ్చిన గౌరవానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంచే చర్యలపై చర్చించారు.
ఈ పద్ధతి ఏడు దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇలా ఇరు దేశాల ఆర్మీ చీఫ్ లను పరస్పరం సత్కరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
అంతకముందు జనరల్ నరవణే రాజధాని ఖాట్మండూలోని బిర్ స్మారక్ అమరవీరుల స్మారక మందిరంలో అమరవీరులకు దండలు వేసి నివాళులర్పించారు. భారత ప్రభుత్వం తరపున నేపాల్ ఆర్మీకి చెందిన రెండు ఆసుపత్రులకు వైద్య పరికరాలను సమర్పించారు. ఇందులో ఎక్స్-రే యంత్రాలు, కంప్యూటెడ్ రేడియోగ్రఫీ సిస్టమ్స్, ఐసియు వెంటిలేటర్లు మరియు అంబులెన్సులు వంటి పరికరాలు ఉన్నాయి.





