
934views
భారత్, చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో వేల సంఖ్యలో భారతీయ సైనికులు సైనికులు సిక్లీవులపై వెళుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ”లద్దాఖ్ వద్ద భారత-చైనా ఘర్షణలు, వాస్తవాధీన రేఖ వద్ద కాల్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో.. 45 సంవత్సరాల్లో తొలిసారిగా 80,000 మందికి పైగా భారత సైనికులు సిక్లీవులకు దరఖాస్తు చేసుకున్నారు” అంటూ వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఇవన్నీ అసత్యాలని ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టం చేసింది. ఈ కారణంగా భారతీయ సైనికులు ఎవరూ సెలవుకు దరఖాస్తు చేయలేదని సైనిక వర్గాలు కూడా స్పష్టం చేశాయి. ఈ విధమైన వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. భారతీయ భద్రతాదళ అధికారులు స్పష్టం చేశారు.





