News

పాక్‌ కాల్పుల్లో అమరుడైన సైనికాధికారి

640views

మ్మూకశ్మీర్‌లోని రజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో పాక్‌ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. వీటిని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో భారత సైన్యానికి చెందిన  జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి రజ్విందర్ సింగ్, అమృత్ సర్, పంజాబ్  వీరమరణం పొందారు. నియంత్రణ రేఖ వెంట పాక్‌ దళాల అనుమానాస్పద కదలికల్ని గుర్తించిన భారత సైన్యం తొలుత వారిని హెచ్చరించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో వారు కాల్పులకు తెగబడ్డారు. దీంతో పాక్‌ దాడిని భారత దళాలు దీటుగా తిప్పికొట్టాయని సైనిక వర్గాలు వెల్లడించాయి. పాక్ శిబిరంలో కూడా ప్రాణ నష్టం సంభవించి ఉండవచ్చని సైనికాధికారుల అంచనా.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.