News

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేసిన తితిదే

616views

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. తిరుపతిలో కంటైన్మైంట్‌ నిబంధనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయం బుధవారం నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. కాగా శ్రీవారి ఆలయంలోని అర్చకులు, ఇతర ఉద్యోగులు కొందరికి కరోనా సోకిందన్న కారణంగా శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేసి, స్వామీ వారి నిత్య కైంకర్యాలను మాత్రం ఏకాంతంగా నిర్వహించాలని పలువురు హిందూ ధార్మిక వేత్తలు, సంస్థలు కోరుతున్న విషయం పాఠకులకు తెలిసినదే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.