ఛత్తీస్గఢ్ లో రెచ్చిపోయిన నక్సలైట్లు
ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లా అరణ్పూర్లో నక్సలైట్లు ఘాతుకానికి పాల్పడ్డారు. మందుపాతర పేల్చి 10 మంది జవాన్లు, ఒక డ్రైవర్ను పొట్టనపెట్టుకున్నారు. మృతులంతా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు. డీఆర్జీ జవాన్లు కూంబింగ్ ముగించుకుని మినీ బస్సులో వస్తుండగా నక్సలైట్లు మందుపాతర పేల్చారు....









