
42views
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆగస్టు నెల కోటాను తితిదే ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల రిజిస్ట్రేషన్ కోసం 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లాటరీలో ఎంపికైన భక్తులు ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నంలోపు సొమ్ము చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయి.





