News

గ‌ణేషుడి ఊరేగింపులో ముస్లిం మృత‌దేహానికి శ్ర‌ద్ధాంజ‌లి

388views
  • హిందూ భ‌క్తుల‌పై ప్ర‌శంస‌ల వెల్లువ‌

రాణేబెన్నూర్‌: క‌ర్ణాట‌క రాణేబెన్నూర్‌లో మ‌త సామ‌ర‌స్యం వెల్లివిరిసింది. నిమ‌జ్జ‌నం కోసం వినాయ‌క విగ్ర‌హాన్ని డీజే పాట‌ల‌తో ఊరేగింపుగా భ‌క్తులు తీసుకుని వెళ్తుండ‌గా, ఓ ముస్లిం వ్య‌క్తి అంతిమ యాత్ర ఎదురుగా వ‌చ్చింది. దీంతో భౌతికకాయం వెళ్ళేంత వ‌ర‌కు వారు త‌మ సంబ‌రాల‌ను నిలిపివేసి, శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. త‌ర్వాత ఎప్ప‌టివ‌లె ఊరేగింపును కొన‌సాగించారు. హిందూ భ‌క్తుల స్పంద‌న‌పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి