
అలీఘర్: యూపీలోని దహీ హండీ వేడుకలో హిందూ బాలికలను వేధించిన ఐదుగురు ముస్లిం యువకులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. వారి చర్యను నిరసించిన హిందూ అబ్బాయిలపై ముస్లిం మూక దాడికి పాల్పడింది. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుక్రవారం అలీగఢ్లోని ఢిల్లీ గేట్ ప్రాంతంలోని వీధి నంబర్ 1 వద్ద ఈ ఘటన జరిగింది. మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశారు.
ఆయుష్ అనే యువకుడు తెలిపిన వివరాల ప్రకారం.. కార్యక్రమంలో కొందరు ముస్లిం యువకులు బాలికలను వేధించారు. ఆయనతోపాటు మరికొందరు నిరసన వ్యక్తం చేయడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ, వెంటనే వారు మరింత మందితో తిరిగి వచ్చి ఆయుష్, మరికొంత మందిని సమీపంలోని మసీదులోకి లాగి దాడి చేశారు. వారిని రక్షించేందుకు ప్రజలు రావడంతో రాళ్ళతో దాడి చేశారు.
పరిస్థితి మరింత దిగజారకుండా పోలీసులు రంగంలోకి దిగారు. నగర బీజేపీ నేతలు కూడా అర్ధరాత్రి పోలీస్ స్టేషన్కు చేరుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అలీఘర్ పోలీసులు ఈ సంఘటనపై ఒక వార్తా బైట్ను విడుదల చేశారు. ఇది మొత్తం సంఘటనను నీరుగార్చి, ‘రెండు వర్గాల మధ్య తీవ్ర/హర్ట్ఫుల్ కామెంట్ల తర్వాత జరిగిన వాగ్వాదానికి’ సంబంధించినది, ఆ ప్రాంతంలో ‘పూర్తి శాంతి’ ఉందని హామీ ఇవ్వడంతో ముగుస్తుంది. పోలీసుల వ్యాఖ్యలపై హిందువులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
యోగి ప్రభుత్వం యూపీ ప్రజలకు కొత్త భద్రతా భావాన్ని తీసుకువచ్చిందనడంలో సందేహం లేదు. కానీ హిందువులపై దాడులు ఆగలేదు. వారి తీవ్రత తగ్గినప్పటికీ. అత్యాచారాలు, గ్రూమింగ్ జిహాద్ కేసులు ఇప్పటికీ ఉన్నాయి. హిందువుల పండుగ ఊరేగింపులపై ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయని స్థానిక హిందువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Source: HINDU POST




