News

రేపు, ఎల్లుండి 200 మంది గోశాలల నిర్వాహ‌కులకు శిక్ష‌ణ‌

412views

తిరుప‌తి: గోశాల‌ల సమర్థ నిర్వ‌హ‌ణ‌, గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయం, దేశ‌వాళీ గోజాతుల సంర‌క్ష‌ణ త‌దిత‌ర అంశాల‌పై గోశాల‌ల నిర్వాహ‌కుల‌కు, ఔత్సాహిక ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌కు తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో ఈ నెల‌ 25, 26వ తేదీల్లో శిక్ష‌ణ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. ఆయా రంగాల్లో నిష్ణాతులైనవారు శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు.

మొద‌టిరోజు తిరుప‌తి, చిత్తూరు జిల్లాల‌కు చెందిన 200 మంది గోశాల‌ల నిర్వాహ‌కుల‌కు, ఔత్సాహిక ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌కు శిక్ష‌ణ ఇస్తారు. రెండోరోజు ఆంధ్రప్ర‌దేశ్‌లోని 40 మంది జిల్లా నోడ‌ల్ గోశాల నిర్వాహ‌కుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌నున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి