
340views
న్యూఢిల్లీ: అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో జరిగే యుద్ధాలను తిప్పికొట్టేందుకు భారత్ సిద్ధమవుతోంది. అందుకు అనుగుణంగా సాధన సంపత్తిని సమకూర్చుకోవడంపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థల సమర్థతను పరీక్షిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఆధునిక కమ్యూనికేషన్, సైబర్, విద్యుదయస్కాంత వ్యవస్థల ప్రభావంపై అధ్యయనం చేపట్టి, ఆ దిశగా తన వ్యూహాలకు పదును పెడుతోంది. భారత సైన్యం ‘స్కైలైట్’ పేరిట జులై 25 నుంచి 29 వరకూ విన్యాసాలు నిర్వహించింది. ఆ సందర్భంగా రోదసిలోని తన వ్యవస్థలను పరీక్షించింది. ఉపగ్రహ ఆధారిత కమ్యూనికేషన్ను పరిశీలించింది.





