News

కావడ్ యాత్రికులపైకి దూసుకెళ్ళిన లారీ… ఆరుగురు మృతి!

436views

ల‌క్నో: ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​లో ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. హరిద్వార్​లో కావడ్ యాత్రకు వెళ్ళి తిరిగి గ్వాలియర్​లోని తమ ఇళ్ళ‌కు వెళ్తుండగా.. ఓ ట్రక్కు ఢీకొట్టింది. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనలో మొత్తం ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. భక్తులను ఢీకొట్టిన ట్రక్కు డ్రైవర్​.. పరారైనట్టు తెలుస్తోంది. నిందితుల కోసం గాలిస్తున్నామని.. త్వరలోనే పట్టుకొంటామ‌ని పోలీసులు తెలిపారు.

శివుడి భక్తులు ఏటా కావడ్ యాత్రకు వెళ్తుంటారు. ఈ భక్తులను కావడియాలుగా పిలుస్తారు. వీరు ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​, గౌముఖ్​, గంగోత్రి, బిహార్​లోని సుల్తాన్​గంజ్​ వంటి పవిత్ర ప్రాంతాల నుంచి గంగాజలం ఇంటికి తీసుకెళ్లి.. దేవుడ్ని పూజిస్తారు. కరోనా కారణంగా.. రెండేళ్ళుగా కావడ్ యాత్ర జరగలేదు. ఈసారి కొవిడ్​ నిబంధనల నడుమ పునఃప్రారంభమైంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి