News

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌పై వైజ్ఞానిక ప్రదర్శన

994views

భాగ్య‌న‌గ‌రం: తెలంగాణలోని హైదరాబాద్ బండ్లగూడ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ద‌క్షిణాది ప్రాంతీయ ప్రధాన కార్యాలయం ఆజాదీకా అమృతమహోత్సవాలను నిర్వహించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అదనపు సంచాలకులు జనరల్ జనార్ద‌న్‌ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్ రిసోర్స్ మ్యాప్‌లను విడుదల చేశారు. హైదరాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూలు, మెదక్, వనపర్తి, పెద్దపల్లి జిల్లాల వనరుల చిత్రపటాలను ఆవిష్కరించారు. 2022-23 సంవత్సరంలో జీఎస్‌ఐ సదరన్ రీజియన్ భూమి, భూగర్భ జలాలు, వనరులు, భూమి కోతలు, కొండచరియలు విరిగిపడటం, సిస్మో టెక్నాలజీ తదితర 184 ప్రాజెక్టులు అమలు చేస్తుందని జనార్ద‌న్‌ ప్రసాద్ వివరించారు. దక్షిణాదితోపాటు లడక్, కచ్, బుందేల్‌ఖండ్ ప్రాంతాల్లో లిథియం నిల్వలపై అన్వేషిస్తున్నామని ఆయన వెల్లడించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి