
514views
భాగ్యనగరం: దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు తమ ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ వ్యతిరేకమని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి నోరు పారేసుకున్నారు. అసదుద్దీన్ ఒవైసీ జైపూర్లో రాజస్థాన్ పార్టీ యూనిట్ను ప్రారంభించారు.
‘‘భారతదేశం భిన్నత్వానికి ప్రసిద్ధి. ఆ వైవిధ్యాన్ని మనం నిలుపుకోవాలి. ఏఐఎంఐఎం యూనిఫాం సివిల్ కోడ్ విధింపునకు అనుకూలం కాదు. గోవా వంటి అనేక చోట్ల హిందువుల కోసం నిబంధనలు రూపొందించారు… బీజేపీ యూనిఫాం సివిల్ కోడ్ అమలు కోసం ఆ నిబంధనలను తొలగించడానికి సిద్ధంగా ఉన్నారా?’’ అని ఒవైసీ ప్రశ్నించారు. 2023లో జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తమ పార్టీ భావిస్తోందని ఒవైసీ చెప్పారు.





