
457views
-
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ వింత పోకడలు
అమరావతి: హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో అయిదు లక్షలలోపు ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణను అక్కడి అర్చకులకు అప్పగించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ ఆలయాల పరిధిలో రెండు లక్షల ఎకరాల వరకు ఉన్నాయని చెప్పారు. వాటిపై అధికారం మాత్రం ప్రభుత్వానిదేనని… కౌలు వేలం నిర్వహణ దేవాదాయశాఖ పరిధిలో ఉంటుందని వ్యాఖ్యనించారు. అయితే, దీనిపై స్పష్టత తీసుకోవాల్సి ఉందన్నారు. అవసరమైతే న్యాయస్థానంలో అప్పీలుకు వెళ్తామని స్పష్టం చేశారు.





