News

దేశంలో జనాభా నియంత్రణకు కొత్త చట్టం తేనున్న కేంద్రం

529views
  • సేవా, సంక్షేమం, సుపరిపాలనే మోదీ మంత్రం

  • కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్

న్యూఢిల్లీ: దేశంలో జనాభాను నియంత్రించేందుకు అవసరమైన చట్టాన్ని త్వరలోనే తీసుకొస్తామని కేంద్ర ఆహార తయారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ పేర్కొన్నారు. ఛత్తీస్​గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లో జరిగిన గరీబ్‌ కల్యాణ్‌ సమ్మేళన్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. ఇప్పటికే అనేక పెద్ద అంశాల్లో తమ ప్రభుత్వం బలమైన నిర్ణయాలను తీసుకుందని, జనాభా నియంత్రణపైనా త్వరలోనే తీసుకుంటుందని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి