
న్యూఢిల్లీ: అమెరికా పర్యటనలో ఉన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పాకిస్థాన్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్కు శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలను నియంత్రించాలని హితవు పలికారు. “ఉగ్రవాదాన్ని అరికట్టాలని నేను అతనికి తెలియజేస్తున్నాను. అతనికి నా శుభాకాంక్షలు” అని రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
పాకిస్థాన్ 23వ ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్ షరీఫ్కు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఉగ్రవాదం లేని ప్రాంతంలో శాంతి, సుస్థిరతను భారత్ కోరుకుంటోందని, ఇరు దేశాలు తమ అభివృద్ధి సవాళ్లపై దృష్టి సారించగలవని ప్రధాని మోదీ అన్నారు. “పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు హెచ్.ఇ. మియాన్ ముహమ్మద్ షెహబాజ్ షరీఫ్కు అభినందనలు ఉగ్రవాదం లేని ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని భారతదేశం కోరుకుంటుంది ’ అని ప్రధాని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు.
Source: NationalistHub





