News

యువతులపై అత్యాచారం… మహమ్మద్ జైద్ అరెస్టు

434views

చెన్నై: డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడులో లవ్ జిహాద్ కేసులు ఎక్కువవుతున్నాయి. 20 మందికి పైగా యువతులను ప్రలోభపెట్టిన మహ్మద్ జైద్ అరెస్ట్‌తో లవ్ జిహాద్ తాజా ఘటన వెలుగులోకి వచ్చింది. అనంతరం లైంగిక వేధింపులకు పాల్పడిన త‌ర్వాత యువ‌తుల‌ను వీఐపీలకు సరఫరా చేశాడు.

26 ఏళ్ళ‌ మోడల్ జైద్ ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళలతో స్నేహం చేశాడు. అక్కడ అతను తన శరీరాకృతి ఫోటోలను పోస్ట్ చేశాడు. అతను వారిని పబ్బులు, రిసార్ట్‌లకు తీసుకెళ్ళాడు. అతను పెళ్ళి హామీపై వారితో శారీరకంగా సన్నిహితంగా ఉండేవాడు. వారిని మోడల్స్‌గా, సినిమాల్లో పనిచేసేలా చేస్తానని హామీ ఇచ్చారు. బాధితుల్లో బాలికలు, ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు ఉన్నారు.

బాధితుల్లో ఒకరు రిసార్ట్‌లో అత‌ని ఫోన్‌ను తనిఖీ చేసి, అనేక మంది మహిళలతో సన్నిహితంగా మాట్లాడటం చూసి షాక్ అయింది. మిగతా బాలికల వివరాలను సేకరించి వారితో వ్యక్తిగతంగా మాట్లాడింది. అతను వారందరితో ఏకకాలంలో రిలేషన్‌షిప్‌లో ఉండి, వారితో గ‌డిపిన‌ట్టు ధ్ర‌వీక‌రించుకుంది.

తాను 2020 నుంచి జైద్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని.. తనను పెళ్ళి చేసుకుంటానని హామీ ఇచ్చి జైద్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. జైద్‌ను పెళ్ళి చేసుకోమని అడగడంతో అతను ఆమెతో మాట్లాడటం మానేశాడు.

ముగ్గురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అత్యాచారం, చీటింగ్ ఆరోపణల కింద కేసు నమోదు చేశారు. గత ఆరు నెలలుగా ఆన్‌లైన్‌లో హోటళ్ళ‌లో 100 గదులు బుక్ చేశానని, సినిమాల్లో అవకాశం కోసం వచ్చిన అమ్మాయిల నగ్న చిత్రాలను తీసి విదేశాలకు పంపినట్టు జైద్ పోలీసులకు తెలిపాడు. కొంతమంది బాధితులను దుబాయ్ సహా విదేశాలకు కూడా తీసుకెళ్ళాడు. అతను సంప‌న్నులు, వీఐపీలకు అమ్మాయిలను సరఫరా చేసిన‌ట్టు అనుమానిస్తున్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి