
రాయ్పూర్: భూ ఆక్రమణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరమశివుడు కోర్టు విచారణకు హాజరయ్యారు. పరమశివుడు(విగ్రహం) ఒక్కడే కాదు ఆయనతోపాటు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో తొమ్మిది మంది కూడా విచారణకు హాజరయ్యారు. ఛత్తీస్గఢ్లోని రాయగఢ్లో 25వ వార్డుకు చెందిన సుధా రజ్వాడే బిలాస్పూర్ హైకోర్టులో ఓ పిటిషన్ వేస్తూ.. ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపించారు.
ఈ కేసులో అధికారులు ఆ భూమిలో ఉన్న శివాలయం సహా 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. దీంతో ఆలయంలోని శివలింగాన్ని హ్యాండ్ ట్రాలీపై కోర్టుకు తీసుకువెళ్ళారు. కోర్టులో అధికారులు లేకపోవడంతో విచారణ రద్దు అయిందని, ఏప్రిల్ 13న హాజరుకావాలని నిర్ణయించారు.
ఛత్తీస్గఢ్ హైకోర్టులో సుధా రాజ్వాడే దాఖలు చేసిన పిటిషన్ ఫలితంగా ఈ పని జరిగింది, ఇందులో శివాలయంతో సహా 16 మంది ప్రభుత్వ ఆస్తులను అతిక్రమించారని ఆరోపించారు. నిజానికి ఆలయం ప్రభుత్వ భూమిని ఆక్రమించివుంటే, సంబంధిత ధర్మకర్తలు లేదా ఆలయ కమిటీకి నోటీసులు ఇవ్వాలి. కానీ, అధికారులు దేవుడే నోటీసులు జారీ చేశారు.
Source: NationalistHub





