
-
పునరుద్ధరించాలని ఢిల్లీ కోర్టులో అప్పీలు
-
ప్రభుత్వానికి, ఎ.ఎస్.ఐ.కి నోటీసులు
న్యూఢిల్లీ: మెహ్రౌలీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో 27 హిందూ-జైన్ దేవాలయాలు ఉన్నాయని, వాటిని పునరుద్ధరించాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో అప్పీల్ దాఖలైంది. దీంతో కోర్టు కేంద్ర ప్రభుత్వానికి, భారత పురావస్తు శాఖకు నోటీసులు జారీ చేసింది. గతంలో ఒక సివిల్ దావాను తిరస్కరించిన సివిల్ జడ్జి ఉత్తర్వుపై ఈ అప్పీల్ చేయడమైనది.
ఆలయాలు ధ్వంసం చేసి, అక్రమ కట్టడం
ఇస్లామిక్ ఆక్రమణదారు కుతుబ్-చే దెబ్బతిన్న, కూల్చివేసిన, అపవిత్రం చేయబడిన సంబంధిత దేవతలతో కూడిన 27 హిందూ, జైన దేవాలయాలను పునరుద్ధరించడం ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 ద్వారా హామీ ఇవ్వబడిన మతం హక్కును వినియోగించుకుంటూ భారతదేశం యొక్క సాంస్కృతిక, మతపరమైన వారసత్వాన్నిసంరక్షించడానికి దావా దాఖలు చేయబడింది. బానిస రాజవంశాన్ని స్థాపించిన ఆక్రమణదారుడు మొహమ్మద్ ఘోరీ కమాండర్ ఐబక్, దేవాలయాల స్థానంలో కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదును నిర్మించాడు.

భగవాన్ విష్ణు, భగవాన్ శివ, భగవాన్ గణేష్, భగవాన్ సూర్య, దేవి గౌరీ, భగవాన్ హనుమాన్, జైన దేవత తీర్థంకర భగవాన్ రిషబ్ దేవ్లకు ఖువ్వతుల్ మసీదు కాంప్లెక్స్ స్థలంలో ఆలయ సముదాయంలో “పునరుద్ధరణ” హక్కు ఉందని ప్రకటించాలని కూడా దావా అభ్యర్థించింది. అదే గౌరవంతో దానిని పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేసింది.
ట్రస్ట్ చట్టం 1882 ప్రకారం, కుతుబ్ కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న ఆలయ సముదాయం నిర్వహణ, నియంత్రణను ట్రస్ట్కు అప్పగించడానికి ఒక ఉత్తర్వు జారీ చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది.
1192లో ఐబక్ దాడి
ఈ కుతుబ్ కారిడార్, దీనిని కువ్వత్-ఉల్-ఇస్లాం మసీదు అని కూడా పిలుస్తారు. ఇది హిందూ దేవతల యొక్క అందమైన దృష్టాంతాలతో కూడిన గొప్ప పురావస్తు నమూనా. చౌహాన్ పాలకుల లాల్-కోట్లో భాగమైన ఈ సముదాయాన్ని 1192లో ఇస్లామిక్ ఆక్రమణదారు కుతుబ్ద్దీన్ ఐబక్ ధ్వంసం చేశాడు.

దేవతల చిత్రాలు… గట్టి రుజువులు
చాలా మంది చరిత్రకారుల ప్రకారం, ఖువాత్-ఉల్-ఇస్లాం మసీదు 27 హిందూ-జైన్ దేవాలయాల శిథిలాలపై నిర్మించబడింది. శ్రీ విష్ణువు, శ్రీ గణేశుడు, యక్షుడు వంటి హిందూ దేవతల చిత్రాలు, పవిత్ర కమలం, కలశం, ఆలయ బావులు వంటి చిహ్నాలు స్పష్టంగా చూడవచ్చు, ఇవి సముదాయం యొక్క హిందూ మూలాన్ని రుజువు చేస్తాయి.
చాలా దేవతల ముఖాలు విరిగిపోయాయి.. ఆలయ భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే, మీరు జాగ్రత్తగా గమనిస్తే, మసీదు కొంత భాగం వాస్తుశిల్పం, సాధారణ మసీదు రూపకల్పనకు భిన్నంగా ఉన్నట్టు మీరు కనుగొంటారు. కారిడార్లు వేద నిర్మాణ శైలిని చూపుతాయి. స్తంభాలపై చెక్కబడిన హిందూ పవిత్ర చిహ్నాలతో దీర్ఘచతురస్రాకార గ్యాలరీలను కలిగి ఉంటాయి.
అరబిక్ ఫాంట్లు..
మీరు గమనించే మరో ముఖ్యమైన అంశం అరబిక్ ఫాంట్లు. అవి ఏదో ఒకదానిపై బలవంతంగా ఓవర్రైట్ చేయబడ్డాయి. కువ్వత్-ఉల్-ఇస్లాం అనే పేరు 27 దేవాలయాలలో ఒకదానికి ఇవ్వబడింది. కుతుబ్మినార్ చుట్టూ ఉన్న మిగిలిన 26 దేవాలయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి, ఇప్పుడు వాటిని పునరుద్ధరించడం కష్టం.
స్పష్టం చేస్తున్న ఎ.ఎస్.ఐ బోర్డు
ఇక్కడ మీరు కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఎ.ఎస్.ఐ) అధికారిక బోర్డును చూడవచ్చు. 27 దేవాలయాలను ధ్వంసం చేసి నిర్మించిన భారత్లోని పురాతన మసీదు ఇదేనని స్పష్టంగా చెబుతోంది. ప్రముఖ చరిత్రకారుడు దివంగత పీఎన్ ఓక్ కూడా ఈ కాంప్లెక్స్లో కుతుబ్ద్దీన్ ఐబాక్ రావడానికి చాలా శతాబ్దాల ముందు ఒక అబ్జర్వేటరీ ఉండేదని పేర్కొన్నాడు. చాలా మంది చరిత్రకారులు ఈ ప్రదేశంలోని మినార్ను గతంలో విష్ణు స్తంభం అలియాస్ ధ్రువ స్తంభంగా పిలిచేవారని గమనించారు.

విష్ణుధ్వజ..
కాంప్లెక్స్లో ఒక ఇనుప స్తంభం ఉంది. దీనిని ‘విష్ణుధ్వజ’ అని పిలుస్తారు. ఇనుప స్తంభంపై బ్రాంహీ లిపిలో ఉండడం.. గొప్ప హిందూ రాజు చంద్రగుప్తుని గురించి మాట్లాడుతుంది. ఈ స్తంభాన్ని గుప్త రాజవంశానికి చెందిన చంద్రగుప్త విక్రమాదిత్యుడు నిర్మించాడని చారిత్రాత్మకంగా నిరూపించబడింది. భగవాన్ విష్ణువు పాదముద్రలు చెక్కబడిన ప్రదేశం అంటే విష్ణుపాదగిరి అని పిలువబడే కొండపై ఈ స్తంభాన్ని నిర్మించినట్టు స్క్రిప్ట్ వెల్లడిస్తుంది. ఇది బహుశా భగవాన్ విష్ణువు వామన్ అవతార్ను సూచిస్తుంది.
Source: HINDU POST





