
-
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: శాంతి ప్రయత్నాలకు, ఉక్రెయిన్ సంక్షోభాన్ని అణిచివేసేందుకు ఏ విధంగానైనా సహకరించేందుకు భారత్ సుముఖంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వెల్లడించారు.
టెలీ చర్చల సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీకి మోదీ ఈ హామీ ఇచ్చారు. “ఉక్రెయిన్లో కొనసాగుతున్న సంఘర్షణ పరిస్థితుల గురించి ప్రెసిడెంట్ జెలెన్స్కీ ప్రధానికి వివరంగా తెలియజేసారు” అని పీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.
భారత పౌరుల భద్రత, పట్ల భారతదేశం లోతైన ఆందోళనను కూడా ప్రధాన మంత్రి తెలిపారు. ఉక్రెయిన్లో ఉన్న విద్యార్థులతో సహా భారతీయ పౌరులను త్వరితగతిన సురక్షితంగా తరలించడానికి ఉక్రెయిన్ అధికారులను సులభతరం చేయాలని ఆయన కోరారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాటలు వినే అతి కొద్ది మంది నాయకులలో ప్రధాని మోదీ కూడా ఉన్నారని, కాబట్టి ఉక్రెయిన్లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భారత ప్రభుత్వం మాస్కోతో సామీప్యాన్ని ఉపయోగించాలని భారతదేశంలోని ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా అన్నారు. కాగా, ప్రధాని మోదీ ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో మాట్లాడారు.
అతనితో కూడా హింసను అంతం చేయడానికి సమగ్ర చర్యల అవసరాన్ని నొక్కి చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ కూడా తన రష్యా కౌంటర్ సెర్గీ లావ్రోవ్, ఉక్రేనియన్ విదేశాంగ మంత్రితో ఫోన్ సంభాషణలు జరిపారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సంభాషణ, దౌత్యమే ఉత్తమ మార్గమని నొక్కి చెప్పారు. ఇదిలావుండగా, ఉక్రెయిన్ సంక్షోభంపై ఓటింగ్ సందర్భంగా యు.ఎన్.ఎస్.సీ వద్ద భారతదేశం స్టాండ్ను రష్యా శనివారం ప్రశంసించింది.
Source: Organiser





