
సుక్మా: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టుని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ మేరకు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. బస్తర్ రేంజ్ ఐజి సుందర్రాజ్ మాట్లాడుతూ, చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ అటవీ సమీపంలో ఆదివారం ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఇక్కడ డిఆర్జి, కోబ్రా (సిఆర్పిఎఫ్) 201వ బెటాలియన్ జాయింట్ టీమ్లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనులకు భద్రత కల్పించేందుకు పెట్రోలింగ్ విధుల్లో ఉన్నాయి.
మావోయిస్టులు బలగాలపై ఉదయం ఏడు గంటలకు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, దానికి బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయని, ఫలితంగా ఒక మావోయిస్టు మరణించాడని ఐజి బస్తర్ రేంజ్ తెలిపారు.
మావోయిస్టు మృతదేహంతో పాటు 12 బోర్ రైఫిల్, 20-25 కిలోల ఐఈడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హతమైన మావోయిస్టును నిషేధిత మావోయిస్టు సంస్థ సీపీఐ-ఎం పొద్దెపడ్కల్ యూనిట్ మిలీషియా కమాండర్ మడ్కం జోగాగా గుర్తించారు. ఎదురుకాల్పులకు సంబంధించి తిమ్మర్పూర్కు చెందిన ఇద్దరు అనుమానిత మావోయిస్టులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
Source: Organiser





