News

పఠాన్‌కోట్‌ ఆర్మీ క్యాంపు వ‌ద్ద పేలుడు

532views

ప‌ఠాన్‌కోట్‌: పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లోని ఆర్మీ క్యాంపు వద్ద ఉన్న త్రివేణి గేట్ సమీపంలో గ్రెనేడ్ పేలుడు సంభవించింది. దీంతో అధికారులు విచారణకు ఆదేశించారు. పఠాన్‌కోట్ ఎస్‌ఎస్పీ సురేంద్ర లాంబా మాట్లాడుతూ ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గ్రెనేడ్‌లోని భాగాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

గ్రెనేడ్‌ను డ్రోన్ ద్వారా జారవిడిచారా అనే అనుమానాలు కూడా రేకెత్తుతూ ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లో జమ్మూ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోని హైసెక్యూరిటీ టెక్నికల్ ఏరియాలో రెండు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. జమ్మూ ఎయిర్‌ఫీల్డ్‌లో జరిగిన రెండు పేలుళ్లలో పేలోడ్‌తో కూడిన డ్రోన్ పేలుడు పదార్థాన్ని జారవిడిచిన‌ట్టు అనుమానాలు ఉన్నాయని డీజీపీ దిల్‌బాగ్ సింగ్ చెప్పారు. దాడి జరిగిన ప్రదేశానికి సమీపంలో ఉన్న ప్రదేశం నుండి డ్రోన్‌ను నడుపుతున్నట్టు తెలిపారు. ఐఈడీలను జారవిడిచేందుకు మాత్రమే డ్రోన్‌ను ఉపయోగించారు. పేలోడ్ పడిపోయిన తర్వాత, డ్రోన్ ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి తిరిగి వెళ్ళిపోయింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.