News

బంగారం అక్రమ రవాణా!

600views
  • ఐదుగురి అరెస్టు

కేరళ: లెక్కల్లో చూపని బంగారాన్ని తీసుకెళ్తున్నందుకు అబ్దుల్‌, బషీర్‌, నాసర్‌, జార్జ్‌, థామస్‌లను కాలికట్‌ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. మరో ఘటనలో పలువురి ప్రయాణికుల నుంచి రూ.3.71 కోట్ల విలువైన బంగారం లభ్యమైంది. వీరంతా దుబాయ్‌, షార్జా నుంచి బంగారాన్ని తీసుకొచ్చారు. సరుకును క్యాప్సూల్స్‌ రూపంలో తయారుచేయించి, శరీరంలోని వివిధ భాగాల్లో అమర్చి అక్రమ రవాణాకు పాల్పడ్డారు.

దుబాయ్‌ నుంచి 2284 గ్రాముల బంగారాన్ని స్మగ్లింగ్‌ చేసిన నితిన్‌ జార్జ్‌.. 1170 గ్రాముల బంగారాన్ని పురుషనాళంలో ఉంచుకోగా, మిగిలినది తన లోదుస్తుల్లో దాచిపెట్టాడు. అబ్దుల్‌ రెహమాన్‌ షార్జా నుంచి 676 గ్రాముల బంగారాన్ని తన పురుషనాళంలో అమర్చాడు. అలాగే, బషీర్‌ నుంచి రూ.80 లక్షల విలువైన 1628 గ్రాముల బంగారం, నాసర్‌ నుంచి 84 లక్షల విలువైన 1170 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి