
749views
ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో ఆదిశంకరాచార్య విగ్రహాన్ని శుక్రవారం (నవంబర్ 5) ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. 2013 ఉత్తరాఖండ్ వరదల్లో ఆదిశంకరాచార్యుల సమాధి ధ్వంసమైన తర్వాత పునర్నిర్మాణమైంది.
ప్రారంభోత్సవానికి ముందు, పురాతన ఆలయంలో ప్రధాని ప్రార్థనలు చేసి ‘ఆరతి’ నిర్వహించి కేదారనాథ్ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
మందాకిని నది ఒడ్డున ఉన్న కేదార్నాథ్ దేవాలయం యమునోత్రి, గంగోత్రి మరియు బద్రీనాథ్లతో సహా ‘చార్ ధామ్ యాత్ర’ అని పిలువబడే నాలుగు పురాతన పుణ్యక్షేత్రాలలో ఒకటి. సామాన్య శకం 8వ శతాబ్దంలో జగద్ గురు ఆదిశంకరాచార్య నిర్మించిన కేదార్నాథ్ ఆలయం శివునికి అంకితం చేయబడింది.
Courtesy: ANI





