News

దేశ వ్య‌తిరేకుల‌కు రామబాణంతో గుణపాఠం

542views
  • ఆర్‌ఎస్‌ఎస్‌ సహ సర్‌ కార్యవాహ డాక్టర్‌ మన్మోహన్‌ వైద్య

న్యూఢిల్లీ: భారతదేశంలో సకల సౌకర్యాలతో క్షేమంగా నివసిస్తూ, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న దేశ వ్య‌తిరేకుల‌కు సమాజం రామబాణంతో గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) సహ సర్‌ కార్యవాహ డాక్టర్‌ మన్మోహన్‌ వైద్య అన్నారు. న్యూఢిల్లీలోని మయూర్‌ విహార్‌ ఎక్స్‌టెన్షన్‌లో పాంచజన్య, ఆర్గనైజర్‌ కొత్త కార్యాలయాలు ప్రారంభమయ్యాయి.

ముఖ్య అతిథిగా డాక్టర్‌ మన్మోహన్‌ వైద్య హాజరై, మాట్లాడారు. భారతదేశం గొప్ప ఆలోచనలు కలిగివుందని, వీటిని కార్యరూపంలో పెట్టి, దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం, సైద్ధాంతిక యుద్ధం జరుగుతోంది… జాతీయ శక్తులను బలోపేతం చేయకుండా ఉండేందుకు దేశ వ్యతిరేకులు ప్రతి స్థాయిలోనూ ప్రయత్నిస్తున్నారు… ఇటువంటి పరిస్థితిలో, దేశ వ్యతిరేక ఆలోచనలు దేశంలో ఉండకూడదు… ఒక విధంగా ఇది మతాల యుద్ధం, యుద్ధానికి శంఖారావం… మతంతో సంబంధం లేని వారు వారిపై రామబాణాలు వేయాలని పిలుపునిచ్చారు. మొత్తం సమాజాన్ని మన సొంతంగా భావించామని, అందుకే మనం సమాజంతో ముందుకు సాగాలని ఆయన కోరారు. ఇది భారతదేశ ప్రాథమిక ఆలోచన. అందరూ భారత మాత బిడ్డలు, అందరి సహకారంతో మతాల యుద్ధంలో విజయం సాధిస్తామని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘం అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు రామ్‌ మాధవ్‌, మాజీ రాజ్యసభ ఎంపీ తరుణ్‌ విజయ్‌, బీజేపీ ఢల్లీి అధ్యక్షుడు ఆదేష్‌ గుప్తా, భారత్‌ ప్రకాశన్‌ ఢిల్లీ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ భరత్‌ భూషణ్‌ అరోరా, డైరెక్టర్‌-బ్రజ్‌ బిహారీ గుప్తా, అనిల్‌ గుప్తా, డైరెక్టర్‌, పబ్లిషర్‌ బిహారీ లాల్‌ సింఘాల్‌, పాంచజన్య ఎడిటర్‌ హితేష్‌ శంకర్‌, ఆర్గనైజర్‌ ఎడిటర్‌ ప్రఫుల్ల కేత్కర్‌, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్రీమతి మోనికా అరోరా, పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

Source:samvad

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి