News

140 మంది ఆఫ్ఘన్ సిక్కులను ఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కనివ్వకుండా నిలిపేసిన తాలిబన్లు

818views

బుధవారం (25 ఆగస్టు) రాత్రి కాబూల్ నుండి భారతదేశానికి బయలుదేరాల్సిన సుమారు 140 మంది ఆఫ్ఘన్ సిక్కులు మరియు హిందువులను తాలిబాన్లు అడ్డుకున్నారు.

ఈ పరిణామం బుధవారం నుండి కాబూల్ విమానాశ్రయంలో ఎదురుచూస్తున్న ప్రత్యేక IAF విమానం బయలుదేరడంలో జాప్యానికి దారితీసింది. బుధవారం రాత్రి విమానాశ్రయం వెలుపల నుండి తాలిబన్లు ప్రయాణికులను వెనక్కి తిప్పి పంపారని ఇండియన్ వరల్డ్ ఫోరం వెల్లడించింది.

ఆఫ్ఘనిస్తాన్‌లోని దాదాపు 200 మంది హిందువులు మరియు సిక్కులు, దేశంలోని ఇతర పౌరులతో సహా, గురువారం ఉదయం నాటికి హిండన్ వైమానిక స్థావరానికి చేరుకోవాల్సి ఉంది. అందుకోసం విమానాశ్రయానికి చేరుకున్న వారిని తాలిబాన్లు అడ్డుకోవడంతో వారి ప్రయాణం నిలిచిపోయింది.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.