News

అయిదుగురికి ఆహారం కోసం… 24 గంటలపాటు ట్రెక్కింగ్ చేసిన సైన్యం

927views

మ్ముకశ్మీర్ లో మంచులో చిక్కుకున్న సంచార బకర్వాల్ (గొర్రెల కాపరులు) కుటుంబానికి ఆహారం అందించేందుకు 24 గంటలపాటు ట్రెక్కింగ్ చేశారు ఆర్మీ సిబ్బంది. 11వేల మీటర్ల ఎత్తులో ఉన్న నాగిన్ సుర్ శిఖరంలో బషీర్ అహ్మద్ అనే వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలు, జంతువుల మందతో కతువా నుంచి మర్వా లోయకు వెళ్తున్నారు. పచ్చిక బయళ్ల కోసం ఏడాదిలో రెండు సార్లు ఇలా వలస వెళ్తుంటారు. ఈ క్రమంలోనే వారు మంచులో చిక్కుకున్నారు.

ఈ క్రమంలో సహాయం కోసం ఆర్మీకి చెందిన ఛత్రూ సబ్ డివిజన్ కు ఫోన్ చేశారు. దీంతో తక్షణం స్పందించిన అధికారులు వారికి ఆహారం, మందులు, ఇతర అత్యవసర వస్తువులను అందించారు. అందుకోసం ప్రతికూల వాతావరణంలో 24 గంటలపాటు కఠిన ప్రయాణం చేశారు. తక్షణ సాయం అందించిన సైన్యానికి అహ్మద్ కుటుంబం కృతజ్ఞతలు తెలియజేసింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.