
821views
విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రి కొవిడ్ సెంటర్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతదేహాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పది మృతదేహాల వివరాలను బంధువులు, అధికారులు గుర్తించారు. విజయవాడ అగ్ని ప్రమాద ఘటనపై గవర్నర్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆసుపత్రి, హోటల్ యాజమాన్యాలపై విజయవాడ సెంట్రల్ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
మృతుల వివరాలు..
-
కొసరాజు సువర్ణలత…గృహిణి (42)… గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడబ్రోలు
2. డొక్కు శివబ్రహ్మయ్య (59) బెల్ కంపెనీ మేనేజరు, మచిలీపట్నం( మూడ్రోజుల క్రితం పాజిటివ్ నిర్ధారణ అయ్యాక చేరారు)
3.పొట్లూరి పూర్ణచంద్రరరావు (80).. కొడాలి, ఘంటశాల కృష్ణా జిల్లా. . గుంటూరు సీపీఓగా గతంలో పనిచేశారు. రిటైర్ అయిన తర్వాత PACS అధ్యక్షుడిగా చేశారు. లంగ్ ఇన్ఫెక్షన్తో కొవిడ్ సెంటర్లో చేరారు
-
సుంకర బాబూరావు (80) రిటైర్డ్ ఎస్సై. ఇందిరానగర్, అజిత్సింగ్నగర్
-
మజ్జి గోపి (54) మచిలీపట్నం
-
జి.వెంకట జయలక్ష్మి (52) కందుకూరు, ప్రకాశం జిల్లా
-
వెంకట నర్సింహ పవన్ కుమార్, కందుకూరు, ప్రకాశం జిల్లా
8, 9. సబ్బిలి రత్న అబ్రహం(48), రాజకుమారి(భార్యభర్తలు), జగ్గయ్యపేట
-
మద్దాలి రఘు, మొగల్రాజపురం





