
697views
కరోనా మహమ్మారిపై ఏపీ సర్కార్ చేస్తున్న పోరాటానికి సత్యసాయి ట్రస్టు తన వంతు సహకారం అందించింది. ఈ మేరకు సీఎం సహాయ నిధికి రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించింది. ఈ మొత్తాన్ని కరోనా నివారణ చర్యల కోసం వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరింది. అలాగే, పెన్నా సిమెంట్స్ రూ.2 కోట్లు, ఏపీ మెడికల్ కౌన్సిల్ రూ.1 కోటి చొప్పున ఏపీ సీఎం సహాయ నిధికి అందజేశాయి.





