
618views
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది.ఈ ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఆపరేషన్ ప్రహార్లో భాగంగా పోలీసులు, మావోయిస్టులు మధ్య తొండమార్కా, దుర్మా, బడేకదేవాల్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతాల్లో భద్రతా బలగాలు దాదాపు 30 గంటల పాటు ఆపరేషన్ ప్రహార్ను చేపట్టాయి. ఘటనా స్థలంలో మావోయిస్టుల నుంచి ఆయుధాలు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.





