
బాలబాలికలకు చదువు, క్రమశిక్షణ, ఆరోగ్యం, నైతిక విలువలను అందిస్తూ వారి సమగ్ర వికాసం కోసం పనిచేస్తోన్న సేవా భారతి…విజయవాడ పీబీ సిద్ధార్థ కళాశాలలో సేవాభారతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 23 న బాలమేళాను నిర్వహించింది. ‘బాలమేళా’లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సిద్ధార్థ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ‘బాలమేళా’ కార్యక్రమంలో విద్యార్థులు శాస్త్రీయ, సంప్రదాయ నృత్యాలు, నృత్య రూపకాలతో అలరించారు. నాటికలతో భళా అనిపించారు. సంప్రదాయ దుస్తులు ధరించి కోలాటం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మాజా ఇండిపెండెంట్ డైరెక్టర్ (MDL ముంబై) శ్రీ బైరిశెట్టి మల్లికార్జునరావు గారు,గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ మరియు APNRT కార్పోరేషన్ EX చైర్మన్ డాక్టర్ రవి వేమూరు గారు పాల్గొన్నారు. ముఖ్య వక్తలుగా రాష్ట్ర సేవికా సమితి ప్రాంత కోశ ప్రముఖ్ శ్రీమతి కస్తూరి పద్మశ్రీ గారు,రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విజయవాడ విభాగ్ ప్రచారక్ శ్రీ నవీన్ గారు పాల్గొన్నారు. సేవాభారతి విజయవాడ అధ్యక్షులు డాక్టర్ సాయికిషోర్ గారు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో 64 అభ్యాసకుల నుండి 850 మందికి పైగా ఔత్సాహిక విద్యార్థులతో పాటు 200 మందికి పైగా తల్లిదండ్రులు మరియు అంకితభావం కలిగిన ట్రస్ట్ సభ్యులు, పర్యవేక్షకులు, ఉపాధ్యాయులు మరియు వాలంటీర్లు పాల్గొన్నారు.