ఇంద్రకీలాద్రి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మ వారి ఆలయ ప్రాంగణంలోని చిన్న గాలిగోపురం ఆవరణలో ఉన్న లక్ష్మీగణపతి స్వామి వారి మందిరం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు ఆది శంకరాచార్య విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు, శంకర పూజ, యతి వందనం జరిపించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ కె.ఎస్. రామరావు పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణమూర్తి, కోట ప్రసాద్, శంకర శాండిల్య, రంగావజ్ఞుల శ్రీనివాసశాస్త్రి పూజా కార్యక్ర మాలను ఘనంగా నిర్వహించారు. చింతలపాటి ఆంజనేయ ఘనా పాటి, పురాణ పండిత్ చింతలపాటి వెంకటేశ్వర శర్మలు ఆది శంకరాచార్యుల వైశిష్ట్యం గురించి భక్తులకు వివరించారు. సాయంత్రం నగరోత్సవాన్ని నిర్వహించగా, మహా మండపం నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. మహా మండపం నుంచి కనకదుర్గనగర్, రథం సెంటర్, కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి, రథం సెంటర్, ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి ఆలయానికి చేరింది. నగరోత్సవంలో ఆలయ అధికారులు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.
325views
You Might Also Like
టిబెట్ సంస్కృతిని కాపాడే పాఠశాలను మూసేయించిన నిరంకుశ చైనా సర్కార్
47
ప్రముఖ టిబెటన్ బౌద్ధ నేత తుల్కు హుంగ్ కర్ దోర్జే స్థాపించిన 'హుంగ్కర్ దోర్జే వొకేషనల్ హై స్కూల్'ను చైనా సర్కార్ బలవంతంగా మూసేయించింది. ప్రముఖ టిబెటన్...
‘‘త్రి భాషా భగవద్గీత’’ సంపుటిని ఆవిష్కరించిన గీతా ప్రెస్
37
అత్యంత చరిత్రాత్మకమైన గీతాప్రెస్ ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషలతో కూడిన ‘‘త్రిభాషా భగవద్గీత’’ను ఒకే సంపుటిలో అందిస్తోంది. ఈ సంపుటి ఇప్పటికే...
అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం
40
కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు సత్యదేవుని అన్నప్రసాదాన్ని ఉచిత మధ్యాహ్న భోజన పథకం ద్వారా...
ఆరెస్సెస్ ఏ సంస్థకూ రిమోట్ కంట్రోల్ కాదు : మోహన్ భాగవత్
39
ఆరెస్సెస్ ఏ సంస్థకూ రిమోట్ కంట్రోల్ గా పనిచేయదని ఆరెస్సెస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ పునరుద్ఘాటించారు. స్వతంత్ర సంస్థలను నేరుగా నడపడం కంటే, సమాజ సేవకు అంకితమైన...
వారసత్వ సంపద మీ సొత్తు కాదు.. పాకిస్థాన్పై భారత్ ఘాటు వ్యాఖ్యలు
38
ప్రపంచ వారసత్వ ప్రదేశమైన తక్షశిలలోని రెండు చారిత్రక కట్టడాల వద్ద పాకిస్థాన్ చేపట్టిన పునర్నిర్మాణ పనులపై తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారంపై ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగం...
చెరువు తవ్వకాల్లో వెయ్యేళ్ల నాటి అరుదైన శివలింగం..
68
ఏలూరు జిల్లా చింతలవల్లి గ్రామంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతమైంది. గ్రామంలోని స్థానిక చెరువు తవ్వకాలలో వెయ్యి సంవత్సరాల నాటి అత్యంత ప్రాచీనమైన, విశిష్టమైన బ్రహ్మసూత్రం...





