ఇంద్రకీలాద్రి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మ వారి ఆలయ ప్రాంగణంలోని చిన్న గాలిగోపురం ఆవరణలో ఉన్న లక్ష్మీగణపతి స్వామి వారి మందిరం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు ఆది శంకరాచార్య విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు, శంకర పూజ, యతి వందనం జరిపించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ కె.ఎస్. రామరావు పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణమూర్తి, కోట ప్రసాద్, శంకర శాండిల్య, రంగావజ్ఞుల శ్రీనివాసశాస్త్రి పూజా కార్యక్ర మాలను ఘనంగా నిర్వహించారు. చింతలపాటి ఆంజనేయ ఘనా పాటి, పురాణ పండిత్ చింతలపాటి వెంకటేశ్వర శర్మలు ఆది శంకరాచార్యుల వైశిష్ట్యం గురించి భక్తులకు వివరించారు. సాయంత్రం నగరోత్సవాన్ని నిర్వహించగా, మహా మండపం నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. మహా మండపం నుంచి కనకదుర్గనగర్, రథం సెంటర్, కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి, రథం సెంటర్, ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి ఆలయానికి చేరింది. నగరోత్సవంలో ఆలయ అధికారులు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.
297views
You Might Also Like
గుజరాత్లో ₹226 కోట్ల అంతర్జాతీయ క్రిప్టో-టెర్రర్ ఫండింగ్ నెట్వర్క్ గుట్టురట్టు: 9 మంది అరెస్ట్
32
గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులు దేశవ్యాప్తంగా కలకలం రేపిన 226.54 కోట్ల రూపాయల భారీ క్రిప్టో కరెన్సీ-టెర్రర్ ఫండింగ్ నెట్వర్క్ను విజయవంతంగా ఛేదించారు. ఈ అంతర్జాతీయ ముఠాకు డార్క్ వెబ్...
దావూద్తో సంబంధాలున్న 9 మంది అరెస్ట్
42
దిల్లీ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. దిల్లీ, ముంబయి సహా దేశంలో పలుచోట్ల దాడులకు ప్రణాళిక రచించిన తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు అధికారులు...
ఉగ్ర పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదు.. అజిత్ దోవల్
33
ఉగ్రవాదంపై పోరాటంలో దేశాలు ద్వంద్వ వైఖరి అవలంబించకూడదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చే నిధులు సమకూర్చే దేశాలపై...
ఆర్ఎస్ఎస్ కార్యాలయం రెక్కీ కేసులో కీలక విషయాలు
51
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కేంద్ర కార్యాలయంపై నిఘా (రెక్కీ) పెట్టిన కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. జైష్-ఎ-మహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థకు చెందిన నిందితుడు రైస్...
1947లో RSS బలంగా ఉండి ఉంటే దేశవిభజన జరిగేది కాదు – అఖిలభారత ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్ జీ..
32
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆవిర్భావంపై ఆందోళన అవసరం లేదని, భారత ప్రజాస్వామ్యానికి అన్ని రకాల గొంతుకలకు, భావోద్వేగాలకు చోటు కల్పించే సామర్థ్యం ఉందని, ‘జెన్ జెడ్’...
ఆపరేషన్ సిందూర్కు సైన్యం సిద్ధం.. ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
41
భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ 2.0 కోసం త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. సరిహద్దుల్లో ప్రస్తుత ప్రశాంతత...





