ఇంద్రకీలాద్రి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మ వారి ఆలయ ప్రాంగణంలోని చిన్న గాలిగోపురం ఆవరణలో ఉన్న లక్ష్మీగణపతి స్వామి వారి మందిరం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు ఆది శంకరాచార్య విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు, శంకర పూజ, యతి వందనం జరిపించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ కె.ఎస్. రామరావు పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణమూర్తి, కోట ప్రసాద్, శంకర శాండిల్య, రంగావజ్ఞుల శ్రీనివాసశాస్త్రి పూజా కార్యక్ర మాలను ఘనంగా నిర్వహించారు. చింతలపాటి ఆంజనేయ ఘనా పాటి, పురాణ పండిత్ చింతలపాటి వెంకటేశ్వర శర్మలు ఆది శంకరాచార్యుల వైశిష్ట్యం గురించి భక్తులకు వివరించారు. సాయంత్రం నగరోత్సవాన్ని నిర్వహించగా, మహా మండపం నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. మహా మండపం నుంచి కనకదుర్గనగర్, రథం సెంటర్, కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి, రథం సెంటర్, ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి ఆలయానికి చేరింది. నగరోత్సవంలో ఆలయ అధికారులు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.
358views
You Might Also Like
యూపీలో పోలీసులకు, గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు
2
ఉత్తర్ప్రదేశ్లో గోవుల అక్రమ రవాణా, గోవధకు పాల్పడుతున్నారన్న సమాచారంతో వెళ్లిన పోలీసులకు, నిందితులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అనుమానిత గో స్మగ్లర్లు తీవ్రంగా...
అఖండ గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు
4
అమరావతి: గోదావరి మహానదిని ఆరాధిస్తూ.. పుణ్యస్నానాలు, పూజలు, ధార్మిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది....
కశ్మీరీ పండిట్ల ఊచకోతపై 28 ఏళ్ల తర్వాత మళ్లీ దర్యాప్తు
11
జమ్మూకాశ్మీర్ లోని వాందామాలో 1998లో 23 మంది కశ్మీరీ పండిట్ల నరమేధంపై ఆ రాష్ట్ర దర్యాప్త సంస్థ(ఎసీఐఏ) పునర్విచారణ ప్రారంభించింది. లోయలో ఉగ్రవాదులు జరిపిన ఘాతుకాలకు సంబంధించిన...
ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. యూపీ విద్యార్థిని పిటిషన్ను కొట్టివేసిన అలహాబాద్ హైకోర్టు..
6
పాఠశాల యూనిఫామ్తో పాటు హిజాబ్ లేదా తలపై స్కార్ఫ్ ధరించేందుకు అనుమతించాలని కోరుతూ ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది....
భూమిపై తొలి జీవం భారత్లోనే పుట్టిందా?
34
భూమిపై జీవం ఆవిర్భావానికి సంబంధించిన అత్యంత ప్రాచీన ఆధారాలను భారతీయ భూగర్భ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. జార్ఖండ్లోని సింగ్భూమ్ క్రేటన్ శిలల్లో సుమారు 350 కోట్ల (3.5...
పాకిస్తాన్ కుట్రల బారిన పడకుండా గురుద్వారాల ద్వారా ISI ప్రమాదాలపై అవగాహన
31
పాకిస్తాన్ తన దుష్టచర్యలను మానడం లేదు. పంజాబ్లో ఉగ్రవాదాన్ని, యువతను మత్తుపదార్థాలకు బానిసలుగా చేసే కుట్రలు చేస్తోంది. దీనిని తిప్పికొట్టడానికి పంజాబ్లోని సిక్కు సమాజం పాకిస్తాన్పై పోరాటం...





