ఇంద్రకీలాద్రి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మ వారి ఆలయ ప్రాంగణంలోని చిన్న గాలిగోపురం ఆవరణలో ఉన్న లక్ష్మీగణపతి స్వామి వారి మందిరం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు ఆది శంకరాచార్య విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు, శంకర పూజ, యతి వందనం జరిపించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ కె.ఎస్. రామరావు పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణమూర్తి, కోట ప్రసాద్, శంకర శాండిల్య, రంగావజ్ఞుల శ్రీనివాసశాస్త్రి పూజా కార్యక్ర మాలను ఘనంగా నిర్వహించారు. చింతలపాటి ఆంజనేయ ఘనా పాటి, పురాణ పండిత్ చింతలపాటి వెంకటేశ్వర శర్మలు ఆది శంకరాచార్యుల వైశిష్ట్యం గురించి భక్తులకు వివరించారు. సాయంత్రం నగరోత్సవాన్ని నిర్వహించగా, మహా మండపం నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. మహా మండపం నుంచి కనకదుర్గనగర్, రథం సెంటర్, కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి, రథం సెంటర్, ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి ఆలయానికి చేరింది. నగరోత్సవంలో ఆలయ అధికారులు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.
342views
You Might Also Like
అస్సాం వరదల బాధితులకు ఆర్ఎస్ఎస్ స్వయంసేవకుల ఆపన్నహస్తం
21
"మానవ సేవే మాధవ సేవ" అనే మూల మంత్రంతో విపత్తుల సమయంలో సమాజానికి తోడ్పడే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), అస్సాంలో సంభవించిన భయంకరమైన వరదల వేళ...
షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అధ్యక్షుడి పిలుపు.
26
బంగ్లాదేశ్లో మరోసారి రాజకీయ కల్లోలం మొదలైనట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్, మాజీ ప్రధాని షేక్ హసీనాతో మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కథనాలు అక్కడి...
అఖిల భారత కార్యకారిణి ప్రతినిధి మండలి సమావేశ తీర్మానం
రాష్ట్ర సేవికా సమితి అఖిల భారత కార్యకారిణి మరియు ప్రతినిధి మండలి సమావేశములు. సమల్ఖా, హర్యానా ; 24, 25 మరియు 26 జూలై 2026 తీర్మానం:...
గ్రామస్థాయికి ‘మహాలక్ష్మీ దీపపూజ’ విస్తరణ : టీటీడీ ఈవో
37
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హెచ్డీపీపీ సహకారంతో నిర్వహిస్తున్న‘మహాలక్ష్మీ దీపపూజ’ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో, దీనిని త్వరలో గ్రామస్థాయికి విస్తరించనున్నట్లు టీటీడీ...
ప్రభుత్వ విద్యాలయాల్లో ‘అనంత అరణ్యాలు’
35
ప్రభుత్వ విద్యాలయాల్లో వేల సంఖ్యలో మొక్కలు నాటి వనాలు పెంచడం ద్వారా కర్బన ఉద్గారాల్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకర వాతావరణ పరిస్థితులు ఏర్పడేలా చేసేందుకు వీబీ...
సామాజిక సమైక్యతను బలోపేతం చేయడంలో యువత చురుకైన పాత్ర
36
రాంచీ: సమాజంలో ఐక్యత, సామాజిక సామరస్యం మరియు బలమైన జాతీయ చైతన్యాన్ని పెంపొందించడమే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన లక్ష్యమని సీనియర్ ప్రచారక్, అఖిల్ భారతీయ...




